తెలంగాణా సీఎంను కలిసిన వైఎస్ షర్మిల
ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా ఈ నెల 8న ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించబోయే వైఎస్సార్ జయంతి వేడుకలకు రావాలని షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వనించారు. కాగా షర్మిల సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులను కూడా వైఎస్ జయంతి వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.