Home Page SliderNational

“లవ్ యూ తలైవా” అంటున్న యంగ్ క్రికెటర్లు

Share with

ఈ IPL సీజన్‌లో ఫుల్‌బిజీగా ఉన్న క్రికెటర్లు కాస్తంత విరామం దొరికితే చాలు తమ అభిమాన హీరోలను కలిసి  వారిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే KKR జట్టు స్టార్ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి,వెంకటేశ్ అయ్యర్ సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను తన నివాసంలో కలిశారు.కాగా ఆ ఫోటోలను వరుణ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మీరు రోజు రాత్రి ఆకాశంలో మిలియన్ల స్టార్లను చూడొచ్చు. ఈ సూపర్‌స్టార్‌ను చూడటం జీవితంలో ఒక్కసారే జరిగే ఘటన. ది వన్ అండే ఒన్లీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కలిశాం.ఆయన మాతో మాట్లాడిన తీరు కుటుంబ సభ్యుడిలా అనిపించింది. లవ్ యూ తలైవా అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.