Home Page SliderTelangana

ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పడం మానుకోవాలి

Share with

తెలంగాణా బీజేపీ అసంతృప్తి నేతలకు చురకలు వేశారు మాజీ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్. అసంతృప్తి నేతలు ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. కిషన్ రెడ్డి నేడు బీజేపీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.  పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవద్దని పేర్కొన్నారు.   కిషన్ రెడ్డినైనా సరిగ్గా పని చేసుకోనియ్యమని, ఫిర్యాదులు ఆపాలని, తప్పులు వెతకడం బంద్ చేయాలని సలహా ఇచ్చారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి, బండి సంజయ్ శాలువా కప్పి సన్మానం చేశారు. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ ఎన్నో కష్టాలు పడి, పార్టీని తెలంగాణలో బలోపేతం చేస్తున్నారని, ఆయనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎప్పుడూ కేంద్రమంత్రిని అవుతాననుకోలేదని, అన్నీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయని, బీజేపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై తమ పోరాటం ఆపేది లేదని, వారి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.