Home Page SliderNational

రేపే WTC ఫైనల్..కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం

Share with

రేపు WTC ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా VS ఆస్ట్రేలియా తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు షాక్ తగిలింది. అదేంటంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా..అతని ఎడమ చేతి బొటనవేలుకు నేరుగా బంతి తగిలినట్లు సమాచారం. దీంతో రోహిత్ తన బొటనవేలుకు టేపును చుట్టుకుంటున్న ఫోటోను క్రికెట్ వర్గాలు ట్వీట్ చేశాయి. కాగా హిట్‌మ్యాన్ ప్రస్తుతం ప్రాక్టీస్ నుంచి తప్పుకుని రెస్ట్ తీసుకుంటున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటప్పుడు టీమిండియా కెప్టెన్‌కు గాయం కావడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈసారి ఎలాగైన కష్టపడి WTC ఫైనల్‌లో కప్పు సాధిస్తామని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు. ఈ సమయంలో రోహిత్‌కు గాయం కావడం టీమిండియాకు మైనస్ పాయింట్ అనే చెప్పాలి.