Home Page SliderNational

ధోని మేనియాతో..ఆ గేమ్‌కు భారీగా పెరిగిన డిమాండ్

Share with

టీమిండియా మాజీ ప్లేయర్ MS ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీళ్లకి ధోని మేనియా ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ధోని కెప్టెన్సీ,ఆట తీరునే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని చాలామంది ఇష్టపడతారు. దీంతో ధోని క్రికెట్ మ్యాచ్‌లో ఆడిన ఆటతోపాటు బయట ఏది చేసినా ఆది సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోతుంది. అయితే ఈసారి ధోని తన మొబైల్‌లో టైమ్‌పాస్‌కి ఆడిన గేమ్ కూడా వైరల్ అవ్వడంతోపాటు ఆ గేమ్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.కాగా ప్రస్తుతం MS ధోనీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో ధోనీ తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కనిపించారు. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఆ మొబైల్ గేమ్‌పై మనసు పడ్డారు. కాగా వెంటనే లక్షలాదిగా డౌన్‌లోడ్స్ చేసుకొని ఆడటం మొదలు పెట్టినట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. కాగా కేవలం 3 గంటల్లోనే 36లక్షల క్యాండీ క్రష్ గేమ్ డౌన్‌లోడ్స్ జరిగినట్లు ధోని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ట్వీటర్‌లో క్యాండీ క్రష్ ట్రెండ్ అవుతోంది.