Home Page SliderNational

ధోనికి ఇదే చివరి IPL మ్యాచ్ కానుందా?

Share with

ఈ IPL సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నెట్టింట ఓ విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. అదేంటంటే స్టార్ క్రికెటర్ ధోనికి ఇదే చివరి IPL కానుందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఈ విషయాన్ని ధోని ఎప్పుడూ ఖండించలేదు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగబోయే LSG Vs CSK మ్యాచ్‌లో ధోని దీనిపై స్పందించారు. కాగా ఇవాళ జరగబోయే మ్యాచ్‌కు టాస్ ముగిసిన తర్వాత కామెంటేటర్ డానీ మోరిసన్ ధోనితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా డానీ మాట్లాడుతూ..”మీరు మీ చివరి సీజన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారని ధోనిని ప్రశ్నించారు. దీనికి ధోని నవ్వుతూ.. ఇది నా చివరి సీజన్ అని మీరు నిర్ణయించుకున్నారు,నేను కాదు” అని సమాధానమిచ్చారు. దీంతో ధోని రిటైర్మెంట్ ఇప్పట్లోనే లేదని అర్థం అవుతుంది. ఈ వార్త విన్న ధోని ఫ్యాన్స్ ఫుల్  ఖుషీ అవుతున్నారు.