Home Page SliderNational

ఎన్నికలు రానున్న ప్రాంతాలకు మాత్రమే మోదీ వెళతారా…అశోక్ గెహ్లాత్

Share with

ప్రధాని మోదీ ఎన్నికలు రానున్న ప్రాంతాలకు మాత్రమే వెళ్తుంటారా.. మణిపూర్‌కు వెళ్లరా.. అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మండిపడ్డారు. మణిపూర్ ఘటనపై మోదీ మాట్లాడుతూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు వారి రాష్ట్రాల శాంతిభద్రతలు పరిరక్షించుకోవాలని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన మనోభావాలను దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఉద్రిక్త పరిస్థితులతో మండిపోతున్న మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నందువల్లే ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంటే ఈపాటికి రాష్ట్రపతి పాలన పెట్టేవారని విమర్శించారు. ఇంతటి అమానవీయ సంఘటన జరిగితే మనదేశం ప్రపంచదేశాల ముందు సిగ్గుతో తలొంచుకోవాల్సిన పరిస్థితిలో ఉందన్నారు. ఇంతటి ఘటన గురించి ఈ పార్లమెంట్ సమావేశాలలో మోదీ మాట్లాడవలసిందే, జవాబు చెప్పవలసిందేనన్నారు. ఇలాంటి ప్రధానిని దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఒకపక్క ఒక రాష్ట్రం జాతి వైషమ్యాలతో రగిలిపోతూ, అల్లర్లు చెలరేగుతుంటే రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాలకు  వెళ్లే ప్రధానిని తన ఇన్నేళ్ల అనుభవంలో ఎన్నడూ చూడలేదన్నారు.