Andhra PradeshHome Page Slider

క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా?

Share with

 ఇవాళ క్రికెటర్ అంబటి రాయడు ఏపీ సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో అంబటి రాయుడు సీఎం జగన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. కాగా క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల జరిగిన IPL మ్యాచ్‌లో CSK తరుపున ఆడిన విషయం తెలిసిందే. అయితే ఇదే తన చివరి IPL మ్యాచ్ అని అంబటి రాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే నాలో ఓ కొత్త కోణాన్ని కూడా కూడా చూస్తారని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆయన తాజాగా ఏపీ సీఎ జగన్‌ను కూడా కలిశారు. దీంతో అంబటి రాయుడు త్వరలోనే వైసీపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి అంబటి రాయుడు ఎప్పుడో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే పొలిటికల్ పిచ్‌పై అంబటి రాయుడు ఇన్నింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.