Home Page SliderNational

ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్” ఎవరంటే..?

Share with

ఐసీసీ ప్రతి నెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌ను ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈసారి ఈ అవార్డును ఆస్ట్రేలియన్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ కైవసం చేసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.కాగా అతడు ఇటీవల జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ అవార్డుకు షమీ,గ్లెన్ మ్యాక్స్‌వెల్,ట్రావిస్ హెడ్ పేర్లను పరిశీలించిన ఐసీసీ చివరగా ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్‌నే ఎంపిక చేసింది. మరోవైపు మహిళల విభాగంలో బంగ్లా స్పిన్నర్ నహీదా అఖ్తర్‌కు ఈ పురస్కారం లభించినట్లు ఐసీసీ పేర్కొంది.