Home Page SliderTelangana

ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా మూలాలు పాత బస్తీలోనే

Share with

ఇందూర్ సిటీ: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రూ.కోట్లు దోపిడీ చేసిందని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. నిజామాబాద్ గోల్ హనుమాన్ చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించారన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పులు, మద్యం తెలంగాణ చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లలో కేంద్రం నుంచి రూ.9 లక్షల కోట్లు వచ్చాయని.. అయినా కూడా కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారి ఇళ్ల ఎదుట బుల్డోజర్లు వస్తాయన్నారు. త్రిబుల్ తలాక్ రద్దు చేసిన ఘనత ప్రధాని మోడీ దేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పి ధన్‌పాల్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ వచ్చే జీతాన్ని పేద విద్యార్థుల చదువుకోసం ఖర్చు చేస్తానన్నారు.