బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది గెలిచినా మళ్లీ ఎన్నికలే!
మహబూబ్నగర్: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది అధికారంలోకి వచ్చినా మళ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీకోసం కొట్లాటలు తప్పవని, తద్వారా కొద్దిరోజులకే ఆ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారని, అప్పుడు ఆ పార్టీలో చీలికలొచ్చి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వం గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇది నా మాటగా చెప్పడం లేదు. స్వయంగా ప్రధాని మోడీ జీ చెప్పారు.