Andhra PradeshHome Page Slider

ఏపీలో ప్రజావేదిక నిర్మాణ ఖర్చు ఎంతంటే..?

Share with

ఏపీలో గతంతో టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రజా వేదికను నిర్మించేందుకు టీడీపీ ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఈ మేరకు ప్రజా వేదిక నిర్మాణానికి అయిన ఖర్చుపై తాజాగా రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్‌లో ప్రజా వేదికకు కేవలం రూ.90 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది.ఈ మేరకు 2017,APR 4 న R&B డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన జీవోను కూడా పంచుకుంది. కాగా ఆ నిధులను కేవలం నిర్మాణానికి మాత్రమే ఉపయోగించారని తెలిపింది. అయితే ప్రజావేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ అవుట్ పోస్టులు,పార్కింగ్‌తో కలిపి మొత్తం రూ.1.90కోట్లు ఖర్చు అయ్యాయని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.