Home Page SliderNational

కోహ్లీ,గంగూలీకి అసలు ఏమైంది?

Share with

ఈ సీజన్ IPL లో భాగంగా ఈ నెల 15న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో గెలుపొందిన అనంతరం తన పక్కనే ఉన్న టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే విరాట్ కోహ్లీ ఇది ఉద్దేశపుర్వకంగా చేశారో..లేక మరిచిపోయి చేశారో తెలియదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే ఈ విభేదాలు క్రమక్రమంగా తారాస్థాయికి చేరినట్లు కన్పిస్తోంది. ఈ క్రమంలో నిన్న కోహ్లీ ఇన్‌స్టాలో గంగూలీని అన్‌ఫాలో చేశాడు. అయితే ఈ రోజు గంగూలీ కూడా ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీని అన్‌ఫాలో చేశారు.  దీంతో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లకు ఏమైందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.