Home Page SliderNational

నీట్ పేపర్ లీకేజీ సంగతేంటి…సుప్రీంకోర్టు

Share with

వైద్య కోర్సులో చేరడానికి అవసరమైన ప్రవేశపరీక్ష నీట్-యూజీ పేపర్ లీకయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఈ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఎన్‌టీఏ ను ఆదేశించింది. ఈ లీకేజీపై దాఖలైన పిటీషన్లపై సమాధానం ఇవ్వాలంటూ ఈ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే విధించాలంటూ దాఖలైన పిటీషన్లను తోసిపుచ్చింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.