Home Page SliderTelangana

ఈసారి 95-100 స్థానాల్లో గెలుస్తాం:కేసీఆర్

Share with

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. దీంతో  రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి హ్యట్రిక్ కొడుతుందన్నారు. కాగా ఇవాళ హైదరాబాద్ శివారు తూంకుంటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95-100 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అయితే 1999లో ఎవరిని అడగకుండానే చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ఆ సమయంలో దానిని ఖండిస్తూ తాను మాత్రమే కేంద్రానికి లేఖ రాశానని సీఎం తెలిపారు. ఆ తర్వాత వెంటనే తెలంగాణా ఉద్యమం ప్రారంభించి పోరాడి తెలంగాణా సాధించుకున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.