వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజాసింగ్ సేవల్ని వినియోగించుకుంటాం..
ధూల్పేట: గోషామహల్లో మూడోసారి గెలుపొందిన ఎమ్మెల్యే రాజాసింగ్ను ధూల్పేటలోని ఆయన ఇంటి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజాసింగ్ సేవల్ని రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కార్పొరేటర్లు శశికళ, డా.సురేఖ తదితరులు పాల్గొన్నారు.