Andhra PradeshHome Page Slider

“సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెస్తాం”:మంత్రి రామ్మెహన్ నాయుడు

Share with

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ..విమానయాన శాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలోనే సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా మార్చి నాటికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు తీసుకువస్తానన్నారు. అయితే వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి పనిచేస్తామని కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు స్పష్టం చేశారు.