Home Page Slider

తెలంగాణాలో పేదరికాన్ని నిర్మూలిస్తాం: KTR

Share with

తెలంగాణా రాష్ట్రంలో ఇకపై పేదరికమే ఉండబోదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లోని ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఈ రోజు కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చిర్లవంచిలో ఎస్సీ,ముదిరాజ్ కమ్యానిటీ హాల్స్‌కు  శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణాలో స్థలం ఉండి ఇళ్లు లేనివారికి గృహలక్ష్మీ పథకం కింద రూ.3లక్షల మొత్తాన్ని అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.