Home Page SliderTelangana

“హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం”: సీఎం రేవంత్ రెడ్డి

Share with

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. వరంగల్ సిటీని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.కాగా వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు.ఈ మేరకు భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులకు తెలిపారు.అయితే నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలన్నారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్‌టైల్స్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20రోజులకోసారి ఇంఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు.నగర అభివృద్ధికి సంబంధించిన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం వెల్లడించారు.వరంగల్‌లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ మేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.