Andhra PradeshHome Page Slider

“ఏపీలో వాలంటీర్లను కొనసాగిస్తాం”: మంత్రి నిమ్మల

Share with

ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా సందిగ్ధత నెలకొంది. కాగా దీనిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వం 2 నెలలుగా జీతం ఇస్తూనే ఉందన్నారు. అయితే ఏపీలో వాలంటీర్ల ద్వారా మాత్రమే పెన్షన్లు పంపణీ చేయగలమని వైసీపీ చేసిన వాదనను టీడీపీ ప్రభుత్వం తప్పని నిరూపించిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కూడా వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పామన్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ఎలా మేలు కలిగించాలనే దానిపై ప్రస్తుతం తామంతా ఆలోచిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.