కేటీఆర్ అభినందనను స్వాగతిస్తాం… ప్రభుత్వానికి సహకరించాలి-రేవంత్
ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు. ప్రతిపక్ష పాత్రను ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఆదేశాలను శిరసా వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరించాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజల లక్ష్యాలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ సహకారం కోరుతుంది. ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించడానికి సహకరించాలి. భారత్ జోడో యాత్ర మాకు స్ఫూర్తి నింపింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతాం. సోనియాకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం ప్రజలిచ్చారు. తెలంగాణలో మానవహక్కులను పునరుద్ధరిస్తాం. ఈ విజయం తెలంగాణ ప్రజలకు అంకితం. కేటీఆర్ అభినందనను స్వాగతిస్తున్నాం. ప్రగతి భవన్ ఇకపై అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుందన్నారు రేవంత్ రెడ్డి