Andhra PradeshHome Page Slider

మనకి “గంజాయి వద్దు బ్రో” : చంద్రబాబు

Share with

ఈ మధ్య కాలంలో దేశంలోని చాలా రాష్ట్రాలలో గంజాయి వినియోగం పెరుగుతుందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణాలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని వెల్లడైంది. కాగా ఏపీలో కూడా గంజాయి వినియోగం బాగా పెరిగిపోతుందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. ఈ సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు ఆయన ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఇవాళ “#ganjaodhubro” ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.  ఈ విధంగా ఏపీలో డ్రగ్స్ మహమ్మారి అంతమయ్యే వరకు పోరాడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  అయితే ఇటీవల కాలంలో ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాల విద్యార్థులు సైతం ఈ గంజాయి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో గంజాయి ప్రభావం విపరీతంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఈ “#ganjaodhubro” అనే క్యాంపెన్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.