Andhra PradeshHome Page Slider

ఏపీలో వైసీపీ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించాం:సజ్జల

Share with

ఏపీలో జగన్ పరిపాలనకు నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద సజ్జల రామాకృష్టారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..ఏపీలో ఈ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించామన్నారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. అంతేకాకుండా ఆయన ప్రతిపక్షపార్టీలపై మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు ప్రజలను నిలువు దోపిడి చేయడానికే వస్తున్నారన్నారు. చంద్రబాబు గతంలో హమీలు ఇచ్చి మోసం చేశారన్నారు. అందువల్లే ఆయన తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకపోతున్నారని సజ్జల చంద్రబాబును విమర్శించారు. టీడీపీ మహనాడు కార్యక్రమం ఆదివారం ముగిసినప్పటి నుంచి అధికార పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష పార్టీయైన టీడీపీకి మధ్య మాటల యుద్ధం మొదలైనట్లు కన్పిస్తోంది. కాగా చంద్రబాబు మహనాడులో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అయితే వైసీపీ నేతలు నిన్నటి నుంచి చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుూనే ఉన్నారు.