Home Page SliderNational

హైకోర్టు తీర్పులో మేం జోక్యం చేసుకోలేం-సుప్రీం

Share with

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోమని, సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి  స్పష్టం చేసింది. పుంగనూరు, అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ నాయకులపై కేసు పెట్టిన ఏపీ ప్రభుత్వం వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో, దీనిని రద్దు చేయమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఈ అల్లర్లలో పోలీసులు గాయపడ్డారని, వారిని సాక్ష్యులుగా ప్రవేశపెడతామని కోర్టుకు వివరించారు ఏపీ తరపు న్యాయవాదులు. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం అనవసరమని, హైకోర్టు పూర్తి విచారణ జరిపిన అనంతరమే బెయిల్ మంజూరు చేసిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటీషన్లను కొట్టివేసింది సుప్రీంకోర్టు.