Home Page SliderTelangana

మనమే అధికారంలోకి రాబోతున్నామన్న: సీఎం కేసీఆర్

Share with

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి భయపడొద్దని, మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎంతో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నేతలు భేటీ అయ్యారు. వారు సీఎం కేసీఆర్‌కి క్షేత్రస్థాయిలో అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా  కేసీఆర్.. మరోసారి ప్రభుత్వ ఏర్పాట్లు గరించి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకూ ప్రశాంతంగా ఉండాలని, 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందామని, ఈ రాష్ట్రానికి మళ్లీ సుపరిపాలన అందించబోతున్నది మనమేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది.