Home Page SliderTelangana

అభివృద్ధిని చూసి ఓటేయండి

Share with

అభివృద్ధిని చూసి ఓటేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.

సత్తుపల్లి : అభివృద్ధిని చూసి ఓటేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. సత్తుపల్లిలోని పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లిలో ప్రతి వ్యాపారస్థుడు వ్యాపారం చేసే విధంగా, ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో తమ ధర్మం పాటించే విధంగా, ప్రతి పౌరుడు మంచి ప్రణాళికలతో జీవనం కొనసాగించేలా, అందరి మనోభావాలకు అనుగుణంగా 15 ఏళ్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సండ్ర కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.