సీఎం జగన్ను సన్మానించిన వీఆర్ఏ సంఘం నాయకులు
గుంటూరు: వీఆర్ఏ సంఘం నాయకులు సీఎం క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. రద్దైన డీఏను పెంచి మరీ అందిస్తుండడంపై వాళ్లు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. అయితే.. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దానిని కొనసాగించాలంటూ ఏపీజీఎఫ్ ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.300 కు బదులుగా డీఏని రూ.500 కు పెంచి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో.. ఏపీజీఎఫ్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యనార్, సుధాకర్, వెంకటేశ్వర్ల బృందం సీఎం జగన్ను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.