Andhra PradeshHome Page Slider

జనసేన గూటికి చేరనున్న విశాఖ ఎమ్మెల్సీ

Share with

విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీ, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాలని ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు వంశీ. మరికొద్ది సేపటిలో పవన్ విజయవాడ చేరుకుంటారని సమాచారం. వైసీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా, వంశీ వెనక్కు తగ్గలేదని, జనపార్టీలో చేరేది ఖాయమని అతని అనుచరులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పార్టీల ఫిరాయింపులు పార్టీలో కలకలం రేపుతున్నాయి.