“విరూపాక్ష” మూవీ @100 కోట్లు
మెగా హీరో సాయిధరమ్ తేజ్,సంయుక్త జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరూపాక్ష. గత నెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ సినిమా వసూళ్లు తాజాగా రూ.100 కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ వెల్లడిస్తూ..ఓ స్పెషల్ వీడియోను పోస్టు చేశారు. అయితే హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ విరూపాక్ష సినిమా నిలిచింది. కాగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్ ,రాజీవ్ కనకాల,అజయ్,బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.