విరాట్ కోహ్లి ‘విరాట్ స్వరూపం’ -ఐపీఎల్లో అరుదైన ‘రికార్డు’
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబయిపై సాధించిన అర్థశతకంతో ఐపీఎల్లో 50 హాఫ్ సెంచరీలు చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. కేవలం 49 బాల్స్లోనే 82 పరుగులు చేసి, RCBని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో అత్యధికంగా 60 హాఫ్ సెంచరీలతో అసీస్కు చెందిన డేవిడ్ వార్నర్ మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ తర్వాత స్థానంలో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49 హాఫ్ సెంచరీలు సాధించాడు.