SI పోస్ట్ సాధించిన గ్రామ వాలంటీర్
ఏపీలో తాజాగా ఎస్సై తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న మేండ్రగుత్తి శివయోగీశ్వరీ ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్కు చెందిన మేండ్రగుత్తి శివయోగీశ్వరీ ప్రస్తుతం వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వార్డు వాలంటీర్గా సేవలందించిన ఆమె ఇకపై పోలీసుగా ప్రజలకు సేవలు అందించనున్నారు. కాగా ఆమె తండ్రి గృహ నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లి గృహిణి. ఆమె ఓ పక్క వాలంటీర్గా పనిచేస్తూనే ఎస్సై ఉద్యోగానికి సిద్ధం అయ్యి ఎస్సై పోస్ట్కు ఎంపికయ్యారు.దీంతో అందరు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.