Home Page SliderTelangana

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

Share with

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 601 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 142 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 87 , మున్సిపల్ శాఖ కు సంబంధించి 53, హోం శాఖకు సంబంధించి 47 దరఖాస్తులు, పంచాయతి రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కు సంబంధించి 52 , ఇతర శాఖలకు సంబంధించి 220 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.