అలయ్ బలయ్కు ఉప రాష్ట్రపతికి ఆహ్వానం
ఢిల్లీ: దసరా పండగ సందర్భంగా హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న అలయ్ బలయ్కి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్ బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాస్లో ధన్ఖడ్ను ఫౌండేషన్ ట్రస్టీ జనార్దన్ రెడ్డితోపాటు ఆమె కలిశారు.