Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన వాసిరెడ్డి పద్మ

Share with

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వాలంటీర్లపై అనుచిత  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలతోపాటు సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. ఆమె మాట్లాడుతూ .. వాలంటీర్ వ్యవస్థ వల్లే మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారని ఆమె మండిపడ్డారు. కాగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. విషపుత్రుడు కూడా అని ఆమె ఎద్దేవా చేశారు. అయితే సినిమాల్లో చూపించే ప్రేమల వల్లే చాలా మంది అమ్మాయిలు ఇళ్లు వదిలి వెళ్లుపోతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని సినిమాల్లో నటించే పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. అయితే ఇలా ఇళ్లు వదిలి వెళ్లిన వారిలో 70% మంది తిరిగొస్తున్నారనే విషయాన్ని పవన్ ఎందుకు గుర్తించడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.