Home Page SliderTelangana

వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ

Share with

కాచిగూడ: కాచిగూడ- బెంగళూరు వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రైలు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుస్తోంది. ప్రస్తుతం కాచిగూడ నుండి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా సుదీర్ఘ నిరీక్షణ జాబితా దర్శనమిస్తోంది. కాచిగూడ సహా దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించడంతో విస్తృత ప్రచారం చేశారు. ఒకసారైనా ఈ రైలులో ప్రయాణం చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు టిక్కెట్ ఛార్జీలు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువైనా ఖర్చుకు వెనకాడకుండా ఇందులో ప్రయాణించడానికి హ్యాపీగా ఉన్నారు ప్రయాణికులు.