టెన్త్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్న వనపర్తి డీఈఓ
పాన్గల్: టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని వనపర్తి డీఈఓ నరహరి అన్నారు. శనివారం పాన్గల్ మండలంలోని దావాజిపల్లి, మహ్మదాపూర్, జమ్మాపూర్, పాన్గల్ పాఠశాలలను ఆయన విజిట్ చేశారు. ఈ సందర్భంగా టెన్త్ క్లాస్ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రణాళికతో చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై వివరాలను టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.