NationalNews Alert

యూపీ బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి

Share with

ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. సంబంధిత వర్గాల వివరణ ప్రకారం చికిత్స కోసం లక్నో తీసుకెళుతుండగా సీతాపూర్ సమీపంలో ఆయన మృతి చెందారు. అరవింద్ లఖింపూర్ ఖేరి జిల్లా గోలా గోకరన్‌నాథ్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా అరవింద్ గెలుపొందారు. ఎమ్మెల్యే మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. అరవింద్ కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు. కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థించారు. ఆయన మృతి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.