Home Page SliderTelangana

సూర్యాపేట బీజేపీ జనగర్జన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Share with

సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడిన ముఖ్యాంశాలు–

కుటుంబ సంక్షేమం కోసమే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని పేదల బాగుకోసం బీజేపీ పనిచేస్తోంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి కుటుంబసభ్యుల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పేదల వ్యతిరేకి బీఆర్‌ఎస్. దళితులు, బీసీలకు అన్యాంయం చేసింది. దళిత ముఖ్యమంత్రి హామీని తుంగలో తొక్కిన వ్యక్తి కేసీఆర్. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట దాట వేశారు. బీసీలకు బీఆర్‌ఎస్ సర్కార్ ఏం చేసింది..? బీఆర్ఎస్ బీసీల సంక్షేమాన్ని ఎందుకు వదిలేసింది? బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తాం. కేసీఆర్ ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పగలడా? గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది. వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నైజం. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ఇటీవలే మంజూరు చేసిన ట్రైబల్ వర్శిటీకి సమ్మక్క- సారక్కల పేరును నిర్ణయించాం. ఈ ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుంది. కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసం ఇటీవలే కొత్త ట్రిబ్యునల్‌ను ప్రకటించాం. జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీటిని అందిస్తున్నాం. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చాం. స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రధాని మోడీ న్యాయం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానిని చేద్దాం. తెలంగాణలో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలి.