కేంద్ర రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో ఆయన ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనాల్సివుంది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఈ కాన్ఫరెన్స్ను వాయిదా వేస్తున్నట్లు రాజ్నాథ్ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కాగా ఈరోజు దేశంలో 12 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోని ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.