NationalNews

కుప్పకూలిన ట్వీన్‌ టవర్స్‌ పై మీమ్స్ హంగామా..

Share with

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ సంస్థ రెండు జంట భవనాలు నేలమట్టమయ్యాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూన్న భవనాల కూల్చివేత విజయవంతంగా పూర్తయ్యింది. ఈ బిల్డింగ్ కట్టాడానికి రూ.70 కోట్లు ఖర్చయితే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ మీట బటన్ నొక్కే చోట ముగ్గురు విదేశీయులు, పేల్చివేత కంపెనీకి చెందిన చేతన్ దత్తా, ఓ పోలీసు ఆధికారి, ఎడిఫిన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ మయూర్ మెహతా ఉన్నారు.

ఈ స్థలాన్ని 2004లో సూపర్ టెక్ లిమిటెడ్‌కు అప్పగించారు. 2011లో రెసిడెన్సీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈ కేసును కోర్టుకు తీసుకువెళ్లింది. సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. ఆయితే ఈ భవనాల కూల్చివేతకు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ట్వీన్‌ టవర్స్ ను ఫోటోలతో, మీమ్స్‌తో నేట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ట్వీన్‌ టవర్స్ ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రండీ ఒక లూక్ వెద్దాం..