Andhra PradeshHome Page Slider

శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం

Share with

ఏపీ: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించి పంచాంగ శ్రవణ పఠనం చేయనున్నారు. ఉగాది ఆస్థాన వేడుకలను పురస్కరించుకుని పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులందరూ ఇది గమనించాలని ప్రార్థన.