తిరుమల ఆనంద నిలయంలోని వీడియో రికార్డింగ్పై టీటీడీ విచారణ
తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో రికార్డింగ్ కలకలం సృష్టించింది. మూడంచెల భద్రతను దాటుకుని ఓ భక్తుడు మొబైల్ ఫోన్తో తిరుమల ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా, తన ఫోన్తో ఆలయం నలుమూలల నుంచి ఆనంద నిలయాన్ని షూట్ చేసి… ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఆనంద నిలయానికి అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీశాడని తెలుస్తోంది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/05/image-116-1024x575.png)
అయితే ఆ భక్తుడు ఆలయంలో ఇంకేమైనా చిత్రీకరించాడా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది. ఆలయంలోని సీసీ కెమెరా విజువల్స్ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/05/image-117-575x1024.png)
ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, భక్తుడు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడమే కాదు, ఆలయ ప్రాంగణాన్ని చిత్రీకరించాడు. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.