Home Page SliderTelangana

కాళేశ్వరంపై తొలిరోజు ముగిసిన న్యాయవిచారణ

Share with

తెలంగాణాలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మొదటి రోజు న్యాయ విచారణ ముగిసింది.ఈ విచారణలో భాగంగా ఇప్పటికే ప్రాజెక్ట్‌ను సందర్శించినట్లు జస్టిస్ ఘోష్ తెలిపారు. ఈ మేరకు త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్టుపై విచారణ ఈ నెల 30 లోపు పూర్తి కాదని మరికాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై నిజాలు తెలియకుండా  పూర్తి నివేదిక ఇవ్వలేమని జస్టిస్ ఘోష్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌పై రేపు విచారణకు హాజరు కావాలని 18 మందికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ విచారణలో భాగంగా మొదటిగా టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయ్యాకే ఆర్థిక అంశాలపై విచారణ చేపడతామని జస్టిస్ ఘోష్ తెలియజేశారు.