ఏపీ,తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
ఏపీ,తెలంగాణాలో నేటి వరకు హైకోర్టు న్యాయమూర్తులుగా సేవలందించిన వారిని బదిలీ చేస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా లభించింది. ఏపీ,తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తులు మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఏపీ హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్,TS హైకోర్టు జడ్జి దేవరాజు నాగర్జున్ బదిలీపై మద్రాసు హైకోర్టుకు వెళ్లనున్నారు.