NewsTelangana

మునుగోడులో విషాదం

Share with

నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిపాడులో విషాదం చోటు చేసుకుంది.  అనుమానాస్పద స్థితిలో విజయ అనే వివాహిత మృతి చెందింది. అయితే విజయ భర్తే ఆమెను కొట్టి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ప్రజా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టినప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూపోతున్నాయి.