Home Page SliderTelangana

రాజధానిలో అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు

Share with

హైదరాబాద్: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు రాజధానిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావు రాజధానిలో ప్రచారం మొదలు పెట్టారు. గురువారం నుండి కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరపున రేవంత్‌రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో సమావేశాల్లో పాల్గొన్నారు. 21 నుంచి నాలుగైదు సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రెండు సభల్లో పాల్గొంటారని సమాచారం. శనివారం బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రధాని మోడీతో మరో బహిరంగ సభకు ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ 25న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.