Andhra PradeshNewsNews Alert

టాలీవుడ్ డైరెక్టర్ బాబీ తండ్రి మృతి

Share with

ప్రముఖ డైరెక్టర్ బాబీ తండ్రి కొల్లి మోహన్‌రావు అస్వస్థతతో కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆనారోగ్య సమస్యతో బాధ పడుతున్న మోహన్‌రావు ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు , బాబీ సన్నిహితులు తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌రావు అంత్యక్రియలు తమ స్వస్థలం గుంటూరులోని నగరంపాలెంలో నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు అసుపత్రిలో కాలయ సంబంధిత వ్యాధితో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న మోహన్‌రావు పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. జై లవకుశ, పవర్, వెంకీమామ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీ.. ప్రస్తుతం మోగాస్టార్ చిరంజీవితో “ వాల్తేరు వీరయ్య ” చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో బీజీగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి మరణం ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.