NewsTelangana

ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు… ఎన్నికలపై తుమ్మల హాట్ కామెంట్స్

Share with

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని… కార్యకర్తలు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పైనే దృష్టి పెట్టానన్న తుమ్మల ఈసారి కార్యకర్తలతోనే ఉంటానన్నారు. ఇకపై కార్యకర్తలు చెప్పినట్టుగా నడుచుకుంటానన్నారు. వారికే పూర్తి సమయం కేటాయిస్తానన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్న తుమ్మల… ఈసారి దృష్టి మొత్తం పాలేరుపైనే పెడతానన్నారు. కార్యకర్తలు మరోసారి ఆశీర్వదిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న తుమ్మల పార్టీ మారబోతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయ్. పార్టీకి దూరంగా ఉంటూనే.. ఆయన నిత్యం కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఏ పార్టీ నుంచి బరిలో నిలిచినా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.