Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు అమ్ముడుపోయిన “ఆ నలుగురు”  

Share with

ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాలలో తీవ్ర దుమారం సృష్టించాయి. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు అధికారపార్టీ వర్గాలు గుర్తించాయి. కాగా ఈ ఎన్నికలలో  క్రాస్ ఓటింగ్‌కి పాల్పడినట్లు నిర్ధారించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం,కోటంరెడ్డి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. దీనిపై పార్టీలో అంతర్గత దర్యాప్తు చేశామని ఆయన వెల్లడించారు. వీరందరికి  చంద్రబాబు డబ్బు ఆశ చూపించారన్నారు. కాగా చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు. అయితే ఈ డబ్బులు చేతులు మారినట్లు కూడా విశ్వసిస్తున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.