Home Page SliderNational

“కాంగ్రెస్ పార్టీకి ఇది మూడో అతి పెద్ద పరాజయం”:మోదీ

Share with

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభలో ప్రసంగించారు.కాగా ఈ ప్రసంగంలో మోదీ ఏపీ ప్రస్తావన తీసుకువచ్చారు. మోదీ మాట్లాడుతూ..సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసిందన్నారు.దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజల ప్రేమను పొందామన్నారు.కర్ణాటక,రాజస్థాన్,యూపీలో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. అయితే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని దేశ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. కాగా 3 సార్లు కాంగ్రెస్ 100 సీట్లలోపే పరిమితమైందన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది మూడో అతి పెద్ద పరాజయం అని మోదీ ఎద్దేవా చేశారు.